Episode 217

'సమాంతరాలు' - పతంజలి శాస్త్రి గారి కొత్త కథా సంపుటం

ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో .

ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో .

పుస్తకం కొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. (https://bit.ly/samantharaalu) .

ఆడియో వినడానికి మై ఆడియో బైట్స్ ఆప్ ని ఉపయోగించండి. (https://web.myaudiobits.com/#/audio-bits)

తెలుగులో మొదటిసారిగా, ఆడియో , ప్రింటెడ్ వెర్షన్స్ ఒకే సారి లభ్యం అవ్వడం, ‘సమాంతరాలు’ సంపుటం ప్రత్యేకత. శాస్త్రి గారి రచనా శైలి, ఈ సంపుటంలో కథలు, ఆడియో బుక్స్ ప్రాచుర్యం,- వీటిపై ఈ ఎపిసోడ్లో చర్చించడం జరిగింది.

ఇంటర్వ్యూ:

సమాంతరాలు కథా సంకలనం వెలువడిన సందర్భంగా రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారితో హర్షణీయం సంభాషణ

హర్షణీయం : ఈ పుస్తకంలో ప్రత్యేకత ఏంటంటే బహుశా మొట్ట మొదటి సారి తెలుగులో ఛాయా రిసోర్సెస్ సెంటర్ నుంచి ప్రింట్ వర్షన్, ఆడియో బైట్స్ నుంచి ఆడియో స్టోరీ వర్షన్ రెండూ ఒకే సారి రిలీజ్ అవుతున్నాయి. మోహన్ గారు, ఆడియో వర్షన్ పై మీ అంచనాలేంటి? ఎందుకంటే, ఇప్పుడిప్పుడే ఆడియో వర్షన్ పాపులర్ అవుతోంది కదా?

ఛాయా మోహన్ : మనకు ఇప్పుడు వచ్చే తరాలు, ముప్పై ఏళ్లలోపు పిల్లలెవరికీ కూడా చదవడం రాదు. కనుక, ఖచ్చితంగా ఆడియో ఈజ్ గోయింగ్ టు ది ఫ్యూచర్. దాన్ని మొట్ట మొదట మనం మొదలుబెట్టడం అనేది ఆశ్చర్యం, బావుంది. ఆశ్చర్యం ఎందుకంటే, అది అనుకోకుండా జరిగింది. అది కూడా మా కండిషన్ ఏంటంటే ప్రింట్ వర్షన్ తో పాటు, ఆడియో కూడా రావాలని గట్టిగా చెప్పడంతోని వాళ్లు సరే అన్నారు. అది ఒక కండిషన్. చూద్దాం………, This is going to be a good beginning. It is going to be a Landmark Thing అని చెప్పగలను.

హర్షణీయం : శాస్త్రిగారు, మీరు ఈ పుస్తకంలో ఐదు కథలు రాశారు. ఇంతకు ముందు కూడా రామేశ్వరం కాకులు, పతంజలి శాస్త్రి కథలు, నలుపు ఎరుపు అని మూడు సంపుటాలు వచ్చాయి. ఆ కథలకి, ఇప్పుడు ఈ పుస్తకంలో మీరు రాసిన కథలకీ స్వరూప స్వభావాల్లో ఏమైనా తేడాలున్నాయా?

పతంజలి శాస్త్రి : There is a thematic undercurrent. ఒక రకమైన ఏక సూత్రత ఉంటుంది. అందువల్ల బహుశా మోహన్ గారు, మిగతా కథలు ఇందులోంచి తీసి వేరే సంకలనం వేద్దాం అన్నారు. ఇవి ఇట్లా ఉన్నాయి కనుక బావుంటుంది అని నిర్ణయించారు. మొదట్లో నేను ఒప్పుకోలేదు. తరువాత ఆయన చెప్పినదాంట్లో నిజం ఉందనిపించింది. ఇప్పుడు, గతంలో నేను రాసిన కథల్లో కూడా ఈ రకమైన ఆలోచన, దృక్పథం కనిపిస్తుంది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మనవాళ్లు ఫిలాసఫీ లేదా తాత్విక దృక్పథం అంటుంటారు. తెలుగుదేశంలో ఒక ప్రత్యేకమైన అవ్యవస్థ ఉంది. ఫిలాసఫీ అన్నా, లేదా ఈ రచనకి ఒక తాత్విక దృక్పథం ఉందని అన్నా వాళ్లు ఏమనుకుంటారంటే ఇదేదో నేల విడిచి సాము చేసే వ్యవహారం ఏదో చేస్తున్నాడని, నిజ జీవితంతో మనకి తెలిసినటువంటి వాస్తవమైన పరిస్థితులతో సంబంధంలేని ఒక మాయ ఏదో చేస్తున్నాడని అనుకుంటారు. మిగతా చోట్ల అట్లా అనుకోరనుకుంటా. ఈ జీవితాన్ని మనం ఎట్లా చూడాలి? ఏరకంగా చూడాలి? ఏ పరిస్థితిలో ఈ జీవితాన్ని మామూలుగా మనం చూసే పద్ధతిలో కాకుండా వేరే రకంగా చూడడం జరుగుతుంది? ఇట్లా అనేక ప్రశ్నలు మనకి అప్పుడప్పుడూ ఎదురవుతూ ఉంటాయి. అట్లా జరిగినటువంటి నాలుగో ఐదో భిన్నమైనటువంటి సందర్భాలు ఈ కథలు. 

ఈ పుస్తకానికి ముందుమాట కాదు కానీ, కేవలం ఒక అరడజను వాక్యాలు రాశాను. ‘‘మీ కథలు అర్థం కావని ’’ బహుశా తరుచుగా వినడం వల్ల నేనలా రాశానేమో తెలీదు. అయితే, నిజం చెప్పాలంటే నేను తరువాత చదువుకున్నాను మోహన్ గారు ప్రింట్ పంపించిన తరువాత. 

నా కథలెలా ఉన్నాయో ఈ ముందు మాట కూడా అలాగే ఉంది. you know what I mean (నవ్వుతూ)… అంటే, ఏమవుతుందో తెలీదు కానీ ఏదో చెప్పాలనుకుంటున్నాను. 

ఈ కథల్లో నేనేమన్నానంటే ‘‘ఓర వాకిలిగా వేసిఉన్న గది లాంటివి నా కథలు చాలా భాగం. మనం తలుపు తోసి లోపలికి వెళ్తే, ముఖ్యంగా వాటి ఆంతరిక ప్రపంచం కనిపిస్తుంది’’ అని రాశాను. నా కథలు మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో ఉండే నిర్మాణ సంబంధమైన ప్రత్యేకతల కంటే కూడా ఇటువంటి ఒక చింతన, ఒక ఆలోచన, ఒక ప్రవాహశీలత, ఒక ప్రవాహ లక్షణం కనిపిస్తుంది. సాధారణ ప్లేన్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ‘‘ఇట్స్ ఏ ఫ్లోయింగ్ మూడ్.’’ ఆ ఇతివృత్తానికి సంబంధించిన ఒక మూడ్ ఏదైతే ఉందో, మీరు అట్ల లోపలికి వెళ్లి వాళ్లతో రెండు మాటలు మాట్లాడగానే, మీరు అందులోకి ప్రవేశిస్తే మెల్లగా పడవలో ప్రవాహంతో పాటు వెళ్తున్నట్టుగా మీరు కూడా ప్రయాణం చేస్తారు.

హర్షణీయం : ఈ మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ మా మధ్య జరిగింది. మా గిరి బాగా కథలు చదువుతాడు. వాడు ‘‘రేమండ్ కార్వర్, టోబయాస్ ఉల్ఫ్ లాంటి మినిమలిస్టిక్ మూమెంట్ రైటర్స్ ఉన్నారు’’ అని చెబుతూ లిటరరీ మినిమలిజం అంటే ఏందనేది నాలుగైదు వాక్యాలు పంపించాడు. నేను ఇప్పుడు దాన్ని చదువుతాను. ‘‘Literary minimalism is often expressed through the use of short or short short stories, that are nearly plotless. They treat isolated moments, or seemingly random in significant events, where the reader is put to some thought in what really happened. The reader has to reflect about the issues presented that lie under need the story just unfolded.’’ 

పతంజలి శాస్త్రి : నేనైతే ఆ మినిమలిస్ట్ ధోరణి అని ఏదైతే మీరంటున్నారో దాని గురించి నేనేమీ చదవలేదు. కానీ నాకు మొదటి నుంచి కూడా క్లుప్తత నాకు చాలా ఇష్టమైన విషయం. కథలకు సంబంధించినంతవరకు క్లుప్తంగా, గుప్తంగా చెప్పడం. ఊరికే అట్లాగ సజెస్టివ్ గా చెప్తూ, ధ్వని అంటే పాఠకుడికి ఇతనేం చెబుతున్నాడు, ఎలా అని ఆలోచించే అవకాశం కల్పించాలని నాకు మొదటి నుంచీ ఉండేది. దానికి గుప్తత అనేది నాకు సహజంగా అలవడ్డది. వాస్తవానికి అందులో ఇంకో భాగం ఏంటంటే understatement నాకు చాలా ఇష్టం. 

నేను ఇంగ్లీష్ భాషను భాగా ఇష్టపడడానికి ఒక కారణం వాళ్ల understatement. చాలా నచ్చుతుంది నాకు. అదొకటి. రెండొవది ఏంటంటే నేను సినిమాలు బాగా చూస్తాను. అనేక ప్రపంచ భాషల్లో ఉండే గొప్ప సినిమాలు. ఈ కోవిడ్ లో నేను యాభై, అరవై సినిమాలు చూశాను. ఏంటంటే స్ర్కీన్ ప్లే కాదు, మంచి నటుల ఫిల్మ్ యాక్టింగ్ లో కనిపించే understatement ఉంటుంది చూశారా? అది నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. అందుచేత ఇవన్నీ నా మీద ప్రభావం చూపాయి. అందుచేత నేను రాసేటప్పుడు పాఠకుడి అంతా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు కాకుండా గుప్తంగా చెప్పింది కొంత, చెప్పంది ఎక్కువగా ఉండే ఏర్పాటు చేస్తుంటాను. నా ఉద్దేశ్యం ఏంటంటే అటువంటి పరిశ్రమ గనుక పాఠకుడు చేస్తే అతడికి కలిగే సాహిత్యానుభవం ఎక్కువ రుచికరంగా ఉంటుంది. ఒక సర్క్యూట్ ఉంటుంది, కరెంట్ సర్క్యూట్ రచయిత, విమర్శకుడు, పాఠకుడు. ఈ సర్క్యూట్ సక్రమంగా ఉంటే రచయిత సుఖంగా ఉంటాడు. భావ ప్రసారం పవర్ లా సరిగ్గా సాగుతుంది. 

మనకి తెలుగులో ఒక ప్రత్యేకత ఏంటంటే విమర్శకులు లేకపోవడం. అందుచేత పాఠకుడికేంటంటే రచయిత బాగా దూరమైపోయాడు. చిన్న సవరణ, అందరు కాదు. కొందరు. నేను చెప్పిన పద్ధతుల్లో రాసే వాళ్లకి పాఠకుడికి దూరం పెరిగిపోయింది. ఎందుకంటే దీని గురించి వివరించి చెప్పే విమర్శకులు లేరు తెలుగులో. అటువంటి సమర్థులున్నారు కానీ, విమర్శ పనిగా పెట్టుకొనే వాళ్లు లేరు.

హర్షణీయం : నీడవెంట, తుర్కపాలెం దేవకన్యలు ఈ రెండు కథలు… నీడవెంట కథలో అతడికి(Protagonist) నలభై ఐదు, యాభై ఏండ్లు ఉంటాయి. తుర్కపాలెం దేవ కన్యల్లో Protagonist కి పదేళ్ల పిల్లవాడు. మీరు వాళ్లు ఊహించే ఊహాలోకానికి, వాస్తవానికి సరిహద్దులేవైతే ఉన్నాయో వాటిని తీసేస్తారు.

పతంజలి శాస్త్రి : నా ఉద్దేశ్యమే అది. అందుకే సమాంతర వాస్తవికత అంటుండేవాడిని. ఇంకా అంటున్నాను. ఈ రెండు నాణేనికి అటు వైపు, ఇటు వైపు అంటామే అలాంటివి. ఏ creative imagination అని అంటున్నానో, మీరంటున్నారో అది it has firmly rooted in reality. మనం అనుకునే వాస్తవానికి మరొక పార్శ్వం అది. 

ఈ తుర్కపాలెం దేవకన్యలు అనేది మరొక ముఖ్యమైన షార్ట్ స్టోరీ. ఎందుకంటే మీరు ఇంతకు ముందు అన్నాడు చూశారా? వాస్తవం, creative imagination కి సంబంధించిన కథ అది. అందుకే ఒక కుర్రవాడిని పెట్టాను. 1952 లో నేను, ఒక ఆర్కియాలజిస్ట్ ఒకాయన కలిసి కోనసీమలో ఒక గ్రామం వెళ్లాం. వెళ్లి ఒకరి ఇంటి వెళ్లాం. అందులో ఒక పెద్దావిడ ఒకామె ఉంటుంది. ఆవిడ వాళ్ల ఊరు గురించి చెబుతోంది. పెద్దావిడ కదా, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతోంది. ‘‘మీరు వెళ్లి ఒకసారి అమ్మవారిని చూసి వెళ్లండి’’ అని, ‘‘ఏమనుకున్నారు మా ఊళ్లో అమ్మవారంటే, అప్పుడప్పుడూ దేవకన్యలు వచ్చి మా కాలువలో స్నానం చేసి వెళ్తుంటారండీ, ఎవ్వరికీ కనబడరు. కనపడ్డా కళ్లు పోతాయండి బాబు’’ అంది. సరే, పెద్దావిడ నవ్వుకున్నాం. 

మామూలుగా చెబుతుంటారు కదా, ‘‘నువ్వు ఏదైనా చూడకు చూస్తే కళ్లు పోతాయి’’ అని మన కథల్లో. తరువాత మర్చిపోయాను నేను ఇన్ని సంవత్సరాలు. 1983 నుంచి 2021 ఈ తుర్కపాలెం దేవకన్యలు కథలో మళ్లీ వాళ్లు వచ్చారు. ఇది బాగా సరిపోతుంది కథలో. 

ఇది అలా ఉంచితే, నేను చెప్పదల్చుకున్న రెండు విషయాలు… చాలా ముఖ్యమైన చాలా చిన్న వాక్యాలు రెండు ఉన్నాయి అందులో. ఆవిడేదో చెబుతూ ఉంటుంది వాళ్ల ఊరి గురించి, ఆలయం గురించి. ఈ కుర్రావాడు American Boy More Or Less. ‘‘పెద్దమ్మా ఇవన్నీ ఎక్కడైనా రాశారా’’ అని అడుగుతాడు. ఆవిడా… ‘‘అన్నీ రాయడమెందుకు రా?’’ అంటుంది. అంటే అన్నీ రాసి ఉండాల్సిన అవసరం లేదు. మౌఖిక సంప్రదాయం ఉంది. ఇలా లక్ష వాటికి సంకేతం అది. ఆ ఒక్క వాక్యం ఎన్నో ఆలోచనలు రావడానికి. అలాగే దేవతల గురించి చెబుతుంటే ‘‘ఎవరైనా చూశారా?’’ అంటాడు. ఆవిడ లేదని చెబుతూ ‘‘అరే, అయినా అన్నీ చూడడమెందుకు? అన్నీ చూడాలా?’’ అంటుంది. నేను చెప్పక్కర్లేదు ఊరికే ప్రస్తావిస్తున్న. seeing is noting. ఏదైతే మనం చూస్తామో, మనం చూసిందల్లా సత్యం కాదు. వాస్తవం సత్యం కాదు. ఇలా మనం ఎంత దూరం వెళ్తే అంత అంటుంది ఆవిడ. చివరగా గుళ్లోకి వెళ్లినప్పుడు ‘‘దీన్ని రాజు ఎవరో కట్టించారట కదా’’ అంటే వీడి స్నేహితుడు ఇంకో కథ చెబుతాడు. ఎందుకంటే వాళ్ల మామ్మ ఇంకో కథ చెప్పింది గుడి గురించి. వాడు ఏమనుకుంటాడు ఇదీ బానే ఉంది అనుకుంటాడు. అంటే ఏమిటీ multiple versions of for of thing. ఒక cultural geography, ఇన్ని విషయాలను అందులో అర్థం చేసుకోవచ్చు.

హర్షణీయం : నీడ వెంట కథలో మీరు కాశీ గురించి చేసిన వర్ణన, గంగానదిని వర్ణించిన తీరు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. 

పతంజలి : నేను ఎప్పుడూ కాశీ వెళ్లలేదు. అయితే, నేను కథకు కాశీని కేంద్రంగా చేసుకోవడానికి కారణం ఏంటంటే అందులోనే రాశాను ‘‘కాశీ ఒక ప్రాచీన విషాదం …’’ people go there to die. చాలా విచిత్రం అది. ఈనాడే కాదు, ఎప్పుడూ. నడిచి వెళ్లి పూర్వం అక్కడ ప్రాణాలు విడిచేవారు. మొత్తానికి మృత్యువు కాశీ అధిష్టాన దేవత. అక్కడ రాజుగారు అంటారు ఒక మాట ఎక్కడా ఆ సత్రంలో ‘‘ఇది శివుడి సొంతూరండి బాబు’’ అని. శివుడు లయకారుడు. ఇది వాడి destination. అయితే ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే, వాడికి తెలియకుండా మృత్యువును వెతుక్కుంటూ వెళ్తాడు. వాడిని మృత్యువు ఆవహిస్తుంది. ఆ విషయం తెలియదు వాడికి. 

అది right from the word go … ఆ కథలో కనిపిస్తుంది మీకు. అందులో రాత్రి చచ్చిపోయినట్లు వాడికి కల వస్తుంది. రెండోది వాడు గదిలో కూర్చుంటే నల్లటి ఆకారం లోపలికి వస్తుంది. అది మృత్యువు. అది గరుడ పురాణంలో వర్ణించినటువంటిది. ఒళ్లు జల్లుమంటుంది. గరుడ పురాణంలో దాని గురించి చెప్పారు. అంటే గరుడ పురాణం చదువలేదు. నాకు చాలా గొప్ప పండితుడొకరు దాని గురించి చెప్పాడు. చెబుతుంటేనే నాకు ఏదోలా అనిపించింది. నల్లటి మగ కాని, ఆడ కాని ఒక ఆకారం అంటే మృత్యువు. రాస్తూ చటుక్కున అది పెట్టాను. అది గరుడ పురాణం తెలియకపోయినా పర్వాలేదు. తెలిసిన వాళ్లకి బానే ఉంటుంది. 

ఇంకోటి అది ఒక చావుతో మొదలవుతుంది. ఆ సాయంత్రం ఒక మృత్యువుతో మొదలవుతుంది. ఏం మృత్యువు? వీడికేం సంబంధ లేదు. ఎవరికీ సంబంధంలేదు. ఎవరో ఒక నాయకుడు చనిపోతే, ఆ నగరంలో రాజమండ్రిలో బంద్ నిర్వహిస్తుంటారు. దాని గురించి మొదలయ్యే చర్చతో మృత్యువుతో మొదలవుతుంది. చటుక్కున ఇంటికి వెళ్లే సరికి వాడికి మృత్యువు ఎదురవుతుంది. వాడి చుట్టూ ఉండే ఈ ప్రపంచం నుంచి వాడు జారి పోతున్నాడు నెమ్మదిగా. He was slipping from the world he knew…. 

ఛాయా మోహన్: ‘మార్కండేయులు కాఫీ’ గురువు గారు . పోగొట్టుకోవడం , వెతకడం …?

పతంజలి శాస్త్రి : మార్కండేయులు కాశీ అనే కథలో నిజానికి నేను చెప్పిందానికంటే చెప్పందే ఎక్కువ. అందులో టైం ని నేను అటూ ఇటూ, ఇటూ అటూ జరిపేశాను. వాళ్లు వెళ్లిపోయి మూడు సంవత్సరాలు అయ్యింది. తరువాత వీళ్లు అక్కడ హోటల్ లో కలుసుకోని అంతకుముందు ఏదో మూన్నెళ్లు అయ్యింది. ఆ తరువాత వీడొస్తాడు. వీడు మాట్లాడేది ఆ మూడు నెలల గురించి. మొదటి మూడు నెలలు. వీడు తరువాతేదో మాట్లాడితే రెండో మూడు నెలల దగ్గరినుంచి ఆగి, వెనక్కి మళ్లీ.. ఈ టైం ని వెనక్కి ముందుకు, అటూ ఇటూ జరుపుతుంది. కానీ మొత్తానికి ఈ ప్రవాహం ఒకటే లోపల. మూడ్ అదే కంటిన్యూ అవుతుంది. అందుకే చాలా చెప్పకుండా వదిలేసింది. మెమరీ అండి. పొందడం పోగొట్టుకోవడం. 

నేనెప్పుడూ అంటుంటాగా man is nothing but a memory. మనిషొక జ్ఞాప‌కం అంతే. ఇతనికి ఇందులో మార్కండేయులు మెమరీస్ లో He knows only possesstion. Possession మాత్రమే తెలుసు అతనికి. అందులో ఆ కథలో చివరన రెండు వాక్యాలున్నాయి. మితృడు ఫస్ట్ పర్సన్ లో అతడంటాడు ‘‘నాకు రెండు చిన్న పెద్ద విషయాలు తెలిశాయి. ఏంటంటే? ఆ అమ్మాయి పూర్ణ, ఆవిడ ఎలా ఉండకూడదనుకుందో అలాగే ఉంది. మార్కండేయ ఎలా ఉండాలనుకున్నాడో అలాగే ఉన్నాడు’’ అని ఎండ్ చేస్తాను. నిజానికి అది బిగ్ క్వశ్చన్ మార్క్. పెద్ద ప్రశ్నార్థకం అది. ఎందుకంటే, వాళ్లు నిజంగా అట్లా అనుకొని ఉన్నారా? ‘‘ఓహో నేను ఇలా ఉండాలి’’ అని వాళ్లు అనుకున్నారా? లేదు నిజానికి. ఆ అమ్మాయి అనుకోలేదు. కానీ వాళ్లు అట్లా ఉన్నారు. దీనికి ప్రేరణ ఏంటి? ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే? అస్థిత్వ వాదులు ఏమంటారంటే? ఏది ఏమైనప్పటికీ నువ్వు ఎలా ఉండాలో అలా ఉన్నావు అంటారు.

హర్షణీయం : ‘ ఇదొక అరసున్నా’ చాలా ప్రత్యేకంగా అనిపించిందీ మీరు ఆ కథను ముగించిన పద్ధతి.

పతంజలి శాస్త్రి : అదేంటంటే, నాకు చాలా ఏళ్ల నుంచి ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అనేక సందర్భాలు మీరు గమనించినట్లయితే, మనిషి మెదడులో ఒక వ్యవస్థ ఉంటుంది. హఠాత్తుగా మీకు ఏదో స్ఫురిస్తుంది. ఒక యాభై సంవత్సరాల అర్థ శతాబ్ది భాందవ్యంలో, స్నేహంలో, సంసారంలో లేదా జీవితానికి సంబంధించిన మరో దాంట్లో మరోదాంట్లో కలగనటువంటి ఓ మార్పు, రాని ఆలోచన క్షణకాలంలో వస్తుంది. అది ఒక Realization కూడా కావచ్చు. మీ జీవితాన్ని మొత్తం తలకిందులు చేసేటటువంటి ఒక మార్పు కావచ్చు. అదీ ఎలా వస్తుందో తెలీదు. ఒకరిని చూడడం వల్ల కావచ్చు, మాట్లాడడం వల్ల కావచ్చు. అలా మామూలుగా ఏకాంతంగా కూర్చున్నప్పుడు చటుక్కున రావచ్చు. 

ఇందులో గురుమూర్తి అనేవాడు భార్య అన్న ఒక చిన్న మాటను పట్టుకొని జీవితాన్ని తవ్వుకుంటూ వెళ్తాడు. ఈ తవ్వకాల్లో ఏమవుతుందంటే, మన గురించి మనకు కూడా తెలియనటువంటి చిత్రమైన విషయాలు తెలుస్తాయి. కనుక వాడికి ఎప్పుడూ కూడా గదిలో పగుళ్లు అగుపిస్తాయి. 

అటువంటి పరిస్థితుల్లో ఇదాంక నేను చెప్పినటువంటి… హఠాత్తుగా వాడికి ఆ అత్యంత ప్రకాశవంతమైన వలయాన్ని చూడగానే వాడి జీవితంలో ఎప్పుడూ చూడని, వాడి అనుభవంలోకి రానటువంటి తేజశ్వంతమైనటువంటి ఒక పరిపూర్ణత వాడికి కనిపిస్తుంది. A completness he never imagined existed. అది తెలియదు వాడికి. చూసేసరికి ఆ అనుభవం ఒక అద్భుతం వైపు తీసుకెళ్తుంది వాడిని. 

కట్టుకున్న తువ్వాలు ఊడిపోతుంది. ఆ ఒక ‘ఏకాంత నగ్నత్వం’ ….in the figurative sense. అలా చూస్తూ ఉండిపోతాడు. అది ఏ రియలైజేషనో, తరువాత కంటిన్యూ అయ్యిందా లేదా అనేది పాఠకుడు ఊహించుకోవాలి.

ఛాయా మోహన్ : సమాంతరాలు ముఖచిత్రం మీద అభిప్రాయం ఏంటి? మీ కిష్టమైన గోదావరి నది, నదిలో కొట్టుకొచ్చే దుంగలు కనిపిస్తాయి? 

పతంజలి శాస్త్రి : గోదావరి అంటే నేను యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. గోదావరి నా జీవితంలో భాగం. పైగా అన్ని కథల్లో కూడా గోదావరి ఒక పాత్ర. కొన్నిట్లో అయితే మేజర్ పాత్ర గోదావరిదే. వాడు అందులో ప్రయాణిస్తూ, అంటే కాలప్రవాహం అనే దృష్టితో కొన్ని కథల్లో రాశాను. అందువల్ల గోదావరి. పైగా ఊళ్లో ఉన్నాను కనుక, మేమిక్కడ గోదావరి గట్టుకు వెళ్లకపోతే ఇక్కడ రాజమండ్రిలో మాకెవ్వరికీ తోచదు. గోదావరి గట్టుకెళ్లి ఓసారి గోదావరిని చూడకపోతే చాలా అసంతృప్తి. రెండోది ముఖచిత్రం ఏంటంటే చాలా ఆసక్తికరమైన కథ అది. వాళ్లు ఒకరికొకరు చాలా భిన్న ప్రపంచాల్లో ఉంటారు. కలిసున్నా కూడా ఎవరి ప్రపంచంలో వాళ్లు ఉంటుంటారు. మళ్లీ ఒకరిపై ఒకరు డిపెండ్ అయి ఉంటారు. అందులో కూడా మినహయింపులుంటాయి. they are also on a shaky zone. ఎందుకంటే పెద్దాయన లైఫ్ అనిశ్చితం. ఆ కుర్రవాడిది ఇంకా ఘోరం. ఇలాగ ఆ ఒడిదుడుకుల్లో వాళ్లు అలా ప్రయాణిస్తుంటారు. 

అందుచేత ఆ దుంగ, పడవ మీద కాదు, దుంగ మీద కూర్చోబెట్టాడు శివాజీ. ఇంకో కారణం నేననుకుంటుంది (శివాజీ చెప్పలేదు నాకు)… రామాయణంలో అనుకుంటా. ఒక శ్లోకం… అందరికీ తెలిసిందే,

‘ యధా కాష్టం ..కాష్ఠంచ ‘ 

నదిలో రెండు వెదురు బొంగులు వెళ్తుంటాయి. ప్రవాహ వేగానికి విడి విడిగా వెళ్తూ మధ్యలో కలుస్తుంటాయి. అది మానవ బాంధవ్యాల గురించి చెబుతుంది. కలుస్తాం, విడిపోతాం. తాత్కాలికమైన బాంధవ్యం ఇది. అది బహుశా అతని మనసులో ఉండి ఉంటుంది. Probably it was on his mind when he was making it.

హర్షణీయం : ధన్యవాదాలు శాస్త్రి గారు.

పుస్తకం కొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. (https://bit.ly/samantharaalu) .

పుస్తకం, ఆడియో వెర్షన్ ‘ఆడియో బైట్స్’ యాప్ కు సబ్స్క్రయిబ్ చేసి వినవచ్చు. (https://audiobites.storytel.com/) .

తెలుగులో మొదటిసారిగా, ఆడియో , ప్రింటెడ్ వెర్షన్స్ ఒకే సారి లభ్యం అవ్వడం, ‘సమాంతరాలు’ సంపుటం ప్రత్యేకత.

శాస్త్రి గారి రచనా శైలి, ఈ సంపుటంలో కథలు, ఆడియో బుక్స్ ప్రాచుర్యం,- వీటిపై ఈ ఎపిసోడ్లో చర్చించడం జరిగింది.

హర్షణీయం పాడ్కాస్ట్ –

‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaa

స్పాటిఫై (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam

ఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5

వెబ్ సైట్ : https://harshaneeyam.in/all

హర్షణీయం ఫేస్ బుక్ లో – https://www.facebook.com/Harsha051271

హర్షణీయం ట్విట్టర్ – @harshaneeyam

హర్షణీయం యూట్యూబ్ లో – https://bit.ly/harshayoutube



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy

About the Podcast

Show artwork for Harshaneeyam
Harshaneeyam
Literary fiction and Translations